Sunday, May 5, 2024

రాజస్థాన్ లో మంకీపాక్స్ అనుమానిత కేసు..

దేశవ్యాప్తంగా మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. రాజస్థాన్ రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కిషన్ ఘడ్ పట్టణానికి చెందిన యువకుడికి మంకీపాక్స్ లక్షణాలుండటంతో అతని కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి పరిశీలనలో ఉంచామని వైద్యులు చెప్పారు. మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం పూణేలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించామని రాజస్థాన్ హెల్త్ యూనివర్శిటీ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement