Friday, May 3, 2024

హిజాబ్ పై ‘గుత్తా జ్వాల‌’ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలిక‌ల‌ను స్కూల్ గేట్ల వ‌ద్ద అవ‌మానించ‌డం మానేయండని బిజెపి ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు గుత్తా జ్వాల. ఈ మేర‌కు హిజాబ్ పై సంచ‌ల‌న ట్వీట్ చేశారు. తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారని గుర్తు చేశారు… స్కూల్ వారి సురక్షిత స్వర్గమని.. నీచ రాజకీయాల నుండి వారిని తప్పించండని డిమాండ్‌ చేశారు గుత్తా జ్వాల. చిన్న మనసులకు మచ్చ పెట్టడం ఆపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గుత్తా జ్వాల. దీనిపై కోర్టులు అత్యంత త్వరగా స్పందించాలని కోరారు. కాగా.. హిజాబ్ వివాదం పై నేడు కర్నాటక హై కోర్టు విచారణ జరుగనుంది. మ‌రి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వ‌నుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement