Saturday, April 20, 2024

Breaking: రూ.300ల కోసం విద్యార్థి ఆత్మ‌హ‌త్య

త‌న త‌ల్లిదండ్రులు రూ.300లు ఇవ్వ‌లేద‌ని ఆత్మ‌హ‌త్య ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాండులోజి నవదీప్‌ (11) 8వ తరగతి చదువుతున్నారు. స్నేహితులు భీమ్లానాయక్‌ నాయక్‌ చిత్రం చూసేందుకు అతని మిత్రులు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారని, తనకు రూ.300 ఇవ్వాలని నవదీప్‌ తండ్రిని నరసయ్యను అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన నవదీప్‌ తలుపులు వేసుకొని.. గది పక్కనే ఉన్న బాల్కనీలో లుంగితో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement