Tuesday, April 30, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. ఉదయం లాభాల‌తో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప నష్టాలు, లాభాల్లో కొనసాగుతూ వచ్చాయి. అయితే ట్రేడింగ్ చివరి అరగంలో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఐటీ, ఫైనాన్సియల్, కన్జ్యూమర్ గూడ్స్ స్టాకులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బలహీనంగా వస్తున్న కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మదుపరులపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి 56,463కి పడిపోయింది. నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 16,958కి దిగజారింది. రిలయన్స్ (3.71%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.44%), బజాజ్ ఫైనాన్స్ (0.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.16%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. హెచ్డీఎఫ్సీ (-5.50%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.73%), ఇన్ఫోసిస్ (-3.55%), ఐటీసీ (-3.33%), టెక్ మహీంద్రా (-3.17%) టాప్ లూజర్స్ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement