Sunday, May 19, 2024

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

పెద్ద‌పల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement