Tuesday, May 7, 2024

భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు షురూ

భద్రాచలంలోని రామయ్య ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 10న శ్రీసీతారామ కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 11న శ్రీరామ మహపట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి కల్యాణ మహోత్సవాలు ఆంక్షలతో జరుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో శ్రీరామ నవమి వేడుకలను ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement