Wednesday, May 8, 2024

Crime: మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ గొడవ.. తల్లిని హతమార్చిన కొడుకు

మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో గొడవ పడిన కుమారుడు.. నిరాకరించిందన్న కోపంతో దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మి (52), వెంకటేశ్వర్ల దంపతుల పెద్ద కుమారుడు మహేశ్ ఇంటర్ పూర్తిచేసి కూలిపనులు చేస్తున్నాడు. తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ గత కొంతకాలంగా తల్లితో గొడవపడుతున్నాడు. డబ్బులు లేవని, తర్వాత చూద్దామని తల్లి చెప్పింది. సెల్‌ఫోన్ కోసం నిన్న మధ్యాహ్నం మరోమారు తల్లీకొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అది మరింత ముదరడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మహేశ్ రోకలిబండతో తల్లి తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె కిందపడింది. చుట్టుపక్కల వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అప్పటికే లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఆమె అక్క దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement