Sunday, May 5, 2024

Breaking: తమిళనాడులో అల్లుడి ఘాతుకం.. ఐదుగురు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో అల్లుడి ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. భార్య కుటుంబంపై భర్త డీజిల్ పోసి నిప్పంటించడంతో ఐదుగురు మృతిచెందారు. భార్య కుటుంబంపై డీజిల్ పోసి నిప్పంటించిన అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో భర్తతో సహా ఐదుగురు మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన అత్త పరిస్థితి విషమంగా ఉంది. అత్తగారింటి నుంచి తిరిగి రాలేదని భార్యపైనా, కుటుంబ సభ్యులపైనా భర్త దాడికి పాల్పడ్డాడు. అనంతరం తానూ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం ధనలక్ష్మీ, చంద్రు వివాహం చేసుకున్నారు. భార్య భర్తల మధ్య ఘర్షణలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య రావడం లేదని భార్య కోసం అత్తింటికి వచ్చిన అల్లుడు చంద్రు ఈ దాడికి పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement