Saturday, April 27, 2024

ట‌ర్కీ..సిరియాలో భూకంపాల‌తో.. 15వేల మంది మృతి

భారీ భూకంపాలతో అత‌లాకుత‌ల‌మైన ట‌ర్కీ..సిరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 15వేల‌మంది మృతి చెందార‌ని అధికారులు వెల్ల‌డించారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సోమవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో 2992 మంది మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశారు. శిథిలాల చిక్కుకున్న వారిలో దాదాపు 60 వేల పైచిలుకు మందిని సహాయ బృందాలు రక్షించాయి. సహాయ చర్యల్లో కీలకమైన 72 గంటల సమయం గడిచిపోయింది. దాంతో, ఇప్పటిదాకా శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో దక్కే అవకాశం లేదు. దాంతో,ఇకపై మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శిథిలాలతో పాటు గట్టగట్టిన మంచు కింద చిక్కుకొని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్క‌డి ప‌రిస్థితులు హృద‌య‌విదార‌క‌రంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement