Thursday, May 9, 2024

సితార ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ లో త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి వెంకీ అట్లూరి డైరెక్ట‌ర్. ఈ మేర‌కు చిత్ర మేక‌ర్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. తెలుగు , తమిళంలో రూపొందనున్న ప్రతిష్టాత్మక చిత్రం కోసం జాతీయ అవార్డు గ్రహీత నటుడు ధనుష్ తో జతకట్టడం మాకు ఆనందంగా ఉంది” అని నిర్మాతలు తెలిపారు.

‘తొలిప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ ‘రంగ్ దే’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. ధనుష్ కోసం ఓ వైవిధ్యమైన కథను రెడీ చేశాడ‌ట‌.పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.14 గా ఈ సినిమా రానుంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. సూర్యదేవర నాగవంశీ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ,ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు (డిసెంబర్ 23) ఉదయం 9.36 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement