Sunday, May 5, 2024

Telangana: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్​ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్‌, సింగరేణి డైరెక్టర్ ఇవ్వాల (శనివారం) విడుదల చేశారు. సింగరేణి వెబ్‌సైట్‌ www.scclmines.comలో అర్హత సాధించిన అభ్యర్థుల లిస్ట్​ ఉంచినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహించిన వారంలోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్‌ తెలిపారు. ఇక.. 117 పోస్టుల కోసం 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు చెప్పారు.

మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నామని, వారం రోజుల్లోనే ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితా విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. కాగా, ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్షను కూడా నిర్వహించారు. 117 పోస్టులకు 99,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 77,907 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement