Wednesday, May 8, 2024

భారత్‌ నుంచి వచ్చే విదేశీయులపై నిషేధం!

భారత్‌ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భారత్‌ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారిపై పలు దేశాల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరిన్ని దేశాలు కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ద్వీపదేశం సింగపూర్‌ కూడా భారత్‌ నుంచి వచ్చే విదేశీయులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చెన్నై నుంచి ఇక్కడకు 129 మందితో ఒక విమానం వచ్చింది. అందులో 12 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో గడిచిన 14 రోజుల్లో భారత్‌ ను సందర్శించిన లేక భారత్‌ లో ఉన్న విదేశీయులకు సింగపూర్‌ వీసాలు ఇవ్వబోమని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి బుడి సాడికిన్‌ స్పష్టం చేశారు. అయితే భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న సింగపూర్‌ వాసులకు మాత్రం అనుమతులు ఉంటాయని ఆయన తెలిపారు.

కాగా, భారత్‌ లో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఇతర దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్‌ నుంచి వచ్చే విమానాలపై విదేశాలు నిషేధం విధిస్తున్నాయి. భారత్‌ లో నిత్యం లక్షల్లో కేసులు నమోదు కావడం, వేలల్లో మరణాలు సంభవించడం భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో చాలా దేశాలు అప్రమత్తమై భారత్‌ నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement