Sunday, May 19, 2024

శిల్పాచౌద‌రి ‘బ్యాంక్ లాక‌ర్లు’ తెర‌వ‌నున్న పోలీసులు

శిల్పాచౌద‌రి ఇప్పుడీపేరు మారుమోగుతోంది. కిట్టీ పార్టీల పేరుతో టాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు ప‌లువురి ద‌గ్గ‌ర కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. దాంతో ఆమెని పోలీసులు నేడు మ‌రోసారి క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఉప్పర్‌పల్లి కోర్టు ఆమెను పోలీసుల క‌స్ట‌డీకి తీసుకునేందుకు అనుమ‌తినిచ్చింది. ఈ మేర‌కు శిల్పా చౌద‌రికి చెందిన బ్యాంకు లాక‌ర్ల‌ను తెర‌వ‌నున్నారు. శిల్పా చౌద‌రి నివాసంలో ఉన్న లాక‌ర్ల‌లో పోలీసుల‌కు ఎటువంటి కీల‌క‌మైన డాక్యుమెంట్లు దొర‌క‌క‌పోవ‌డంతో బ్యాంకు లాక‌ర్ల‌ను తెర‌వ‌నున్నారు పోలీసులు. పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు.మరో వైపు తనకు డబ్బులు ఇచ్చిన వారు తనకు డబ్బులు తిరిగి ఇస్తే బాధితులకు డబ్బులు ఇస్తామని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement