Thursday, May 16, 2024

ఒకే వేదిక‌పై వైసీపీ, టీడీపీ ఎంపీలు

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. రాజ‌కీయంగా ఎప్పుడూ వైసీపీ, టీడీపీ నేత‌లు మాట‌ల‌తో ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఉంటారు. అయితే అనూహ్యంగా ఇరుపార్టీల నేత‌లు ఒకే వేదిక‌ను పంచుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆస‌క్తి క‌ర దృశ్యం ఢిల్లీలో క‌నిపించింది. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర బీసీ సంఘాల నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొని ఒకే వేదిక‌ను పంచుకున్నారు. వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, భ‌ర‌త్, టీడీపీ ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్, కేసినేని నాని, కింజ‌రాప్ రామ్మోహ‌న్ వేదిక‌పై ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంఘాల హ‌క్కుల గురించి ప‌లువురు ఎంపీలు మాట్లాడారు. కాగా ఒకే వేదిక‌పై టీడీపీ, వైసీపీ ఎంపీలు ఒకే వేదిక‌ను పంచుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement