Tuesday, May 7, 2024

దక్షిణాదిన టచ్‌ పాయింట్ల విస్తీర్ణమే టార్గెట్: స్కోడా ఆటో ఇండియా..

స్కోడా ఆటో ఇండియా దక్షిణ భారతదేశంపై దృష్టి సారించి భారతదేశం అంతటా తన మార్కెట్‌ ఉనికిని క్రమంగా విస్తరిస్తోంది. చెక్‌ ఆటో బ్రాండ్‌ గత సంవత్సరంలో దక్షిణాది మార్కెట్లో తన కస్టమర్‌ టచ్‌ పాయింట్లను 84 శాతం పెంచింది. ఇక్కడ డీలర్‌ నెట్‌వర్క్‌ 2020లో 38 శాతం టచ్‌పాయింట్ల నుంచి 2021లో 70 శాతం టచ్‌ పాయింట్లకు పెరిగింది. ఈ విస్తరణ ప్రణాళిక బ్రాండ్‌.. వ్యూహానికి అనుగుణంగా ఉంది. దేశవ్యాప్తంగా టచ్‌ పాయింట్ల సంఖ్యను పెంచడం ద్వారా వినియోగదారులకు దక్షిణాదిలో డీలర్‌ నెట్‌వర్క్‌ ఈ వేగవంతమైన విస్తరణ, దక్షిణ ప్రాంతంలో విక్రయాల్లో 90 శాతం వృద్ధికి దారితీసింది. స్కోడా ఆటో ఇండియా దక్షిణ భారతదేశంలో నగరాల వారీగా తన ఉనికిని డిసెంబర్‌ 2019లో 19 నగరాల నుంచి నవంబర్‌ 2021 నాటికి 38కి రెట్టింపు చేసింది. మెట్రో నగరాలతో పాటు బ్రాండ్‌ ఇప్పుడు షిమోగా, కరూర్‌, దిండిగల్‌, మువటుపుజా, కన్నూర్‌ వంటి మార్కెట్స్‌లో వినియోగదారులకు సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది.

రాబోయే నెలల్లో తిరుపతి, కరీంనగర్‌, గుల్బర్గా, బళ్లారి, అనంతపురంలోకి ప్రవేశించడానికి మరిన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. స్కోడా ఆటో భారతదేశం దక్షిణాది విస్తరణ, కుషాక్‌ ఎస్‌యూవీ కోసం 20,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను నమోదు చేయడం ఒకే సారి జరిగాయి. 2021లో విజయవంతమైన విస్తరణ గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్స్‌లో ఒకటి. మా వృద్ధి వ్యూహానికి ఇది చాలా ముఖ్యమైంది. పరిశ్రమ ఇటీవలి కాలంలో ఎదురుగాలిని ఎదుర్కొన్నప్పటికీ.. ఈ వృద్ధి మా దృష్టి సారించిన విస్తరణ ప్రణాళికకు నిదర్శనం. ఈ కొత్త సౌకర్యాల ప్రారంభోత్సవం మా వ్యాపార లక్ష్యాలను అందించడంలో ముఖ్యమైన భాగం. కస్టమర్లకు వారి సౌలభ్యం మేరకు అత్యుత్తమ తరగతి సేవలను అందిస్తుంది అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement