Wednesday, May 15, 2024

అర్పితా ప్లాట్ లో సెక్స్ టాయ్స్-మాయ‌మ‌యిన ల‌గ్జ‌రీ కార్లు-షాక‌యిన ఈడీ

మంత్రి పార్థ‌ఛ‌ట‌ర్జీ..అత‌డి స‌న్నిహితురాలు అర్పితా ఛ‌ట‌ర్జీ విష‌యంలో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ దేశం మొత్తం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి విదిత‌మే. ఈ కేసులో ఈడీ త‌న విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది.ఈ విచార‌ణలో భాగంగా ఉన్నతాధికారులు షాకింగ్ దృష్యాల‌ను చూశారు. ఉన్న‌త వ‌ర్గాల స‌మాచారం మేరకు అర్పిత ఫ్లాట్ నుండి అనేక సెక్స్ టాయ్స్ ల‌భ్యం అయ్యాయి. అయితే వాటిని అక్క‌డికి తీసుకొచ్చింది ఎవరు .. వాటి ఉపయోగం ఏమిటి ..అనే కోణంలో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఆ ప్లాట్ లో వెండి గిన్నెలు కూడా ల‌భించాయి. కానీ అవి పెద్ద‌గా ఖ‌రీదైన‌వేమీ కావు. అయితే ఆ ప్రాంతంలో వెండి గిన్నెల‌కు మరో సామాజిక కోణం కూడా ఉంది. బెంగాలీలలో కొత్తగా పెళ్లయిన జంటకు వెండి గిన్నె ఇస్తుంటారు. ఇది అక్క‌డ సంప్రాదాయంగా వ‌స్తున్న ప‌ద్ద‌తి.

ఈ గిన్నెల్లో దీపం వెలిగించడం ద్వారా రాబోయే తరాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావాలని ఆకాంక్షించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలాంటి గిన్నెలు అర్పిత ప్లాట్ కు ఎందుకు వ‌చ్చాయో అర్థం కావ‌డం లేదు.సెక్స్ టాయ్‌కు సంబంధించిన అంశంలో అర్పితను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఆ టాయ్స్ ఆమెకు ఎవరు ఇచ్చారు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిందా ? దాన్ని కొనడానికి కారణం ఏమిటి అనే ప్ర‌శ్న‌ల‌కు ఈడీకి అధికారుల‌కు తలెత్తుతున్నాయి. కాగా అర్పిత ముఖర్జీ నివాసాల్లో దాదాపు రూ. 50 కోట్ల రూపాయలు స్వాదీనం చేసుకున్న కేసులో మరో ట్విస్ట్. అర్పిత ముఖర్జీ ఇంట్లో నాలుగు లగ్జరీ కార్లు మాయం అయిన విషయం తాజాగా వెల్లడవడం సంచలనం సృష్టించింది. అర్పిత అరెస్టయినప్పటి నుంచి కోల్‌కతాలోని డైమండ్ సిటీ కాంప్లెక్స్‌లోని ఆమె నివాసంలో నాలుగు లగ్జరీ కార్లు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. అవి ఏమయ్యాయో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement