Friday, May 17, 2024

పొలంలో త్రాచుపాము కలకలం.. నలుగురు కూలీలకు కాటు..

మహబూబాబాద్ జిల్లాలో ఓ త్రాచుపాము నలుగురు మహిళా కూలీలను కాటేసింది. ఏకకాలంలో నలుగురిని కాటేయడంతో తోటి కూలీలు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ నలుగురు మహిళా కూలీలు చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని వావిలాల గ్రామం కస్నాతండకు చెందిన వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేయడానికి వెళ్లారు. పొలంలో నాట్లు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సుమారు పది అడుగుల పొడవు ఉన్న త్రాచు పాము ఏక కాలంలో నలుగురు మహిళలకు కాటు వేసింది. దీంతో ఆ మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నలుగురు మహిళలు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement