దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలనే మూటకట్టుకున్నాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లాయి. అయితే గంట తర్వాత ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు కోల్పోయి 60,821కి పడిపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 18,114 వద్ద స్థిరపడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement