Monday, April 29, 2024

స‌ర‌యూకి మ‌రోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు

మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ఓ యాడ్ లో న‌టించింద‌ని బిగ్ బాస్ బ్యూటీ స‌ర‌యుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాంతో ఆమె మ‌రోసారి బంజారాహిల్స్ పీఎస్ కి రానుంది. 7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో ఈ మధ్య కాలంలో రిలీజ్‌ చేసింది. సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు ఈ వీడియో ఉంది. ఈ నేపథ్యంలోనే.. హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో యుట్యూబ్ నటి సరియుకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. 41A CrPC కింద నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. 153A, 295A కింద కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement