Friday, April 19, 2024

తెరుచుకోని దుకాణాలు.. స్తంభించిన రవాణా.. ప్రశాంతంగా రాజంపేట బంద్..

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజంపేట బందుకు ప్రజలు, దుకాణదారులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి తమ మద్దతును తెలిపారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిండంతో రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

ఈ సందర్భంగా జెఏసి నాయకులు మాట్లాడుతూ.. అన్నమయ్య పుట్టిన గడ్డను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రజలు అన్ని వర్గాల  మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తప్పనిసరిగా రాజంపేట జిల్లా కేంద్రంగా సాధిస్తామని, అందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement