Friday, April 26, 2024

Big Breaking: స‌ఫారీలు ఫ‌స‌క్‌.. నిప్పులు చిమ్మే బంతుల‌కు ఫ‌టాఫ‌ట్ వికెట్లు!

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో సఫారీలు క‌ష్టాల్లో చిక్కుకున్నారు. అప్పటికే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తున్న ఆ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన కేశ‌వ్ మ‌హ‌రాజ్ (41) కూడా అవుటయ్యాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేసిన 18వ ఓవర్లో కేశ‌వ్ మ‌హ‌రాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. స‌ఫారీల జ‌ట్టులో అంద‌రికంటే ఎక్కువ స్కోరు చేసింది, కాస్త నిల‌క‌డ‌గా ఆడింది కూడా మ‌హ‌రాజ్ మాత్ర‌మే. దీంతో సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 106/8 స్కోరుతో నిలిచింది. ఇక‌.. టీమిండియా 107ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement