Friday, May 3, 2024

హైవే పై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇసుక లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మరో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పరకాల సివిల్ హాస్పిటల్ కు తరలించారు. శాయంపేట మండలం మందారిపేట శివారులో ఈ ఘటన జరిగింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనలో పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: హుజురాబాద్ లో హీటెక్కిన రాజకీయం!

Advertisement

తాజా వార్తలు

Advertisement