Saturday, April 27, 2024

Red chilli: పసిడితో ఎర్ర బంగారం పోటీ… క్వింటాల్ మిర్చి ధర రూ. 52 వేలు

వరంగల్ మార్కెట్ లో ఎర్రబంగారం సిరులు కురిపిస్తోంది. మిర్చికి రికార్డ్ ధరలు పలుకుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం క్వింటాల్ మిర్చికి రూ. 40 వేలకు పైగా ధర పలికిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రికార్డ్ ధర పలికింది. వరంగల్ ఎనమామూల మార్కెట్ లో క్వింటాల్ దేశీ మిర్చికి రూ. 52,000 ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన ధరల్లో ఇదే ఆల్ టైం రికార్డ్ ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దేశ చరిత్రలోనే ఇదే రికార్డ్ ధర అని అధికారులు తెలుపుతున్నారు. దేశీ మిర్చితో పాటు సింగిల్ పట్టి రకానికి కూడా రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చికి డిమాండ్ ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement