Thursday, March 28, 2024

Breaking : వికారాబాద్ బాలిక అత్యాచారం, హ‌త్య కేసులో – ప్రియుడే హంత‌కుడు – ఎస్పీ

వికారాబాద్ జిల్లా బాలిక అత్యాచారం, హ‌త్య కేసుని ఛేదించారు పోలీసులు. కాగా వికారాబాద్ బాలిక హ‌త్య వివ‌రాల‌పై ప్రెస్ మీట్ పెట్టారు ఎస్పీ. మీడియా ముందుకు నిందితుడిని తీసుకువ‌చ్చారు. బాలిక‌ను హ‌త్య చేశాడు ప్రియుడు మ‌హేంద‌ర్. కాగా ప్రియుడు మ‌హేంద‌ర్ ఈ నేరానికి పాల్ప‌డ్డాడ‌ని ఎస్పీ వెల్ల‌డించారు. ప్రియుడు మ‌హేంద‌రే హంత‌కుడ‌ని పోలీసులు తేల్చి చెప్పారు. బాలిక‌తో నిందితుడు మ‌హేంద‌ర్ కి ఏడాదిగా ప‌రిచ‌యం ఉంద‌ని పోలీసులు తెలిపారు. మ‌ద్యం తాగి బాలిక‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు..ఈ పెనుగులాట‌లో బాలిక త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయ‌ని పోలీసులు చెప్పారు. అనంత‌రం బాలిక శ‌రీరంలో చ‌ల‌నం లేక‌పోవ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని గొంతు నులిమి హ‌త్య చేశాడు నిందితుడు. ఆ త‌ర్వాత త‌న‌కేమి తెలియ‌న‌ట్టు ఇంటికి వెళ్లి ప‌డుకున్నాడు మ‌హేంద‌ర్ అని వివ‌రించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement