Friday, May 10, 2024

భారీ మొత్తంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టివేత

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామ సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఓ మినీ వ్యాన్ లో తరలిస్తున్న తొమ్మిది లక్షల రూపాయల విలువచేసే నిషేధిత పొగాకు సీఐ ఎండి ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడులు బుధవారం వేకువజామున పట్టుకున్నారు. పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను గిద్దలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీ వ్యాన్ ను సీజ్ చేయడంతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో పట్టుపట్టడం ఇటీవల ఇదే ప్రథమమ‌ని సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ రాకెట్ వెనుక ఎంతటి వారైనా ఉన్నా సరే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement