Saturday, April 27, 2024

రాజ్య‌స‌భ ఎన్నిక ప‌త్రాన్ని అందుకున్న ర‌విచంద్ర‌.. అభినందించిన ప‌లువురు ప్ర‌ముఖులు

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఒద్దిరాజు ర‌విచంద్ర‌ను అభినందించారు ప‌లువురు మంత్రులు. శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, తాతా మ‌ధు, ఎంపీ మాలోత్ క‌విత‌, ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ ఉన్నారు. వారి స‌మ‌క్షంలో ర‌విచంద్ర త‌న ఎన్నిక‌ ప‌త్రాన్ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర్సింహ‌చార్యుల నుంచి స్వీక‌రించారు. అనంత‌రం నేత‌లంతా ఒద్దిరాజు ర‌విచంద్ర‌ను అభినందించి రాజ‌కీయాల్లో రాణించి పార్టీకి మంచిపేరు తీసుకురావాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement