Tuesday, May 7, 2024

రైతుబంధు సంబరాలు – భూపాలపల్లిలో ముగ్గుల పోటీలు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : రైతుబంధు సంబరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం భూపాలపల్లి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారు 450 మందికి పైగా మహిళలు ,విద్యార్థినులు, యువత పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హాజరై బహుమతులు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement