Friday, April 26, 2024

రైతుబంధు సంబరాలు.. భూపాలపల్లిలో ముగ్గుల పోటీలు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సంబురాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 450 మందికి పైగా మహిళలు, విద్యార్థినులు, యువత పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హాజరై బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement