Wednesday, May 1, 2024

రోడ్డుపై కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొని బోల్తా

హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలవురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు వదిలి డ్రైవర్ పరారైయ్యాడు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కారుపై రూ.13 వేల పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. అన్నీకూడా ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్​కు సంబంధించిన చలాన్లే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement