Saturday, May 4, 2024

రంజాన్ విషెష్ తెలిపిన – రామారావు ఆన్ డ్యూటీ చిత్ర టీం

రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.ఈ చిత్రంలో హీరోగా ర‌వితేజ న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం త‌రచూ ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరిస్తుంది. తాజాగా చిత్ర బృందం రంజాన్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌వితేజ కాజ్యువ‌ల్‌గా న‌డుస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అంతేకాకుండా మ‌రో అప్‌డేట్‌ను కూడా ప్ర‌క‌టించారు. ఈ చిత్రం నుంచి మ‌రో సింగిల్‌ను విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ‘సొట్ట‌ల బుగ్గ‌ల్లో’ అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను మే 7న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌లే విడుద‌లైన ‘బుల్ బుల్ తరంగ్’ పాట‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా దివ్యాంక కౌశిక్, ర‌జీషా విజ‌య‌న్‌లు హీరోయిన్లుగా న‌టించారు. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement