మహిళా దినోత్సవం 2022 వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సమాచార శాఖ (ఐఆండ్పీఆర్) ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టు తన చిన్నారిని మంత్రి కేటీఆర్కు ఇచ్చారు. ఆ పాపను ముచ్చటగా ఎత్తుకుని కేటీఆర్ చాలా సేపు ముద్దుచేశారు. పిల్లల పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పాపను ఎత్తుకున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ నుంచి మరో మహిళా మంత్రి సబితారెడ్డి పాపను తీసుకోవడానికి ట్రై చేయగా ఆ పాప తన చేతులతో ఆడుకుంది కానీ, కేటీఆర్ దగ్గర నుంచి ఆమె చెంతకు వెళ్లలేదు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
చిన్నారితో రామన్న చిద్విలాసం.. మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్ జర్నలిస్టులకు సన్మానం..
Advertisement
తాజా వార్తలు
Advertisement