Sunday, May 5, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో – ఘ‌నంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఘ‌నంగా జ‌రిగాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌ కుమార్‌, దీవకొండ దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వివేకానంద, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రగతి భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement