Tuesday, May 7, 2024

గ‌జ‌దొంగని అరెస్ట్ చేసిన రాచ‌కొండ పోలీసులు – 52తులాల బంగారం స్వాధీనం

క‌రుడ‌గ‌ట్టిన గ‌జ‌దొంగ‌ను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేశారు హైద‌రాబాద్ రాచ‌కొండ సీసీఎస్ పోలీసులు. 2006వ సంవ‌త్స‌రం నుండి పోలీసుల‌కు దొర‌క‌కుండా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న గ‌జ‌దొంగ రాసికుల్ ఖాన్ పాల్ప‌డుతున్నాడు. రాచకొండలో ఏకంగా… 17 ఇళ్ల‌లో దొంగతనాలకు పాల్పడ్డాడు నిందితుడు. పలు రాష్ట్రాల్లో 100లకు పైగా గజ దొంగ రాసికుల్ ఖాన్ పై కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే … 3.5 కిలోల బంగారం పలు కేసులో కూడా ఈ గజ దొంగ రాసికుల్ ఖాన్ కీలక ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే… ఈ నిందితుడి కోసం 70,000 ఫోన్ నంబర్స్ సెర్చ్ చేశారు పోలీసులు.గజ దొంగ రాసికుల్ ఖాన్ ను అరెస్టు చేసి… ఏకంగా… 52 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాళం ఉన్న ఇండ్లను రెక్కీ చేసి దోచుకుంటున్న రాసికుల్ ఖాన్… కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇక తాజాగా ఈ గజ దొంగ రాసికుల్ ఖాన్ ను అరెస్టు చేశారు పోలీసులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement