Friday, April 19, 2024

కారు బీభ‌త్సం : ఒక‌రు మృతి, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

కారు బీభ‌త్సం సృష్టించ‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన విషాద ఘ‌ట‌న విజయవాడలో జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన కారు విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్ పై రోడ్లు శుభ్రం చేస్తోన్న సిబ్బందిని ఢీకొట్టింది. ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పారిశుద్ధ్యం కార్మికులను ఢీకొట్టిన తర్వాత కారు ఒక ఆటోను కూడా ఢీకొట్టింది. ఆ ఆటో పూర్తిస్థాయిలో నుజ్జునుజ్జు అయింది. కారు టైర్ పంక్చర్ అయిపోయివుంది. వేగంగా వస్తున్న సమయంలో కారు టైర్ పగటడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement