Monday, April 29, 2024

పీవీ సింధు భార‌త్ కి గ‌ర్వ‌కార‌ణం-సీఎం జ‌గ‌న్

పీవీ సింధుకు శుభాభినంద‌న‌లు అని ట్వీట్ చేశారు సీఎం జ‌గ‌న్ ..నేడు జ‌రిగిన ఫైన‌ల్లో పీవీ సింధు చైనా ష‌ట్ల‌ర్ వాంగ్ జీ యీపై విజ‌యం సాధించి టైటిల్ ని కైవ‌సం చేసుకుంది. ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. సింగపూర్ ఓపెన్ టోర్నీలో సింధుకు ఇదే తొలి టైటిల్ అని తెలిపారు. కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తర్వాత ఈ ఏడాది ఆమె సాధించిన మూడో టైటిల్ అని సీఎం జగన్ వివరించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా సింధు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సింధు భారత్ కు గర్వకారణమని అభివర్ణించారు. ఈ సీజన్ లో మూడో టైటిల్ గెలిచి అంతకంతకు మెరుగవుతోందని కొనియాడారు. సింధు ఇదే ఒరవడి కొనసాగించి, భారతావనికి మరింత శోభ తీసుకురావాలని అభిలషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement