Thursday, March 28, 2024

Shocking News: కరెంట్​పోల్​ దగ్గర యూరిన్​ చేస్తుంటే విద్యుత్​ షాక్​, వ్యక్తి మృతి

హైదరాబాద్​లో వింత ఘటన జరిగింది. అయితే దీన్ని సీరియస్​ ఇన్సిడెంట్​గా కూడా చెప్పుకోవచ్చు.. ఎక్కడ జాగా లేదని పోయి పోయి కరెంట్​పోల్​కు (విద్యుత్​ స్తంభానికి) యూరిన్​ చేస్తుంటే షాక్​ కొట్టింది. సైదాబాద్‌లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ స్తంభం దగ్గర మూత్ర విసర్జన చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి చనిపోయాడు.

కాగా, మృతుడిని గుజరాత్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ కరీం భాయ్ (40)గా గుర్తించారు. సంఘటన జరిగినప్పుడు మాదన్నపేట్ మండిలోని ఒక వ్యాపారంలో కిరాణా సామాను దించుకోవడానికి పట్టణానికి వచ్చాడు. సరుకులు దించిన తర్వాత రిలీఫ్ కోసం కరీం ధోబీ ఘాట్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీ సమీపంలో కారును ఆపాడు. మూత్ర విసర్జన చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ షాక్ తగిలి చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement