Friday, April 26, 2024

పునీత్ స‌మాధిని సంద‌ర్శించి..కంట‌త‌డి పెట్టిన‌ సూర్య‌..

తమిళ స్టార్ హీరో సూర్య..ఇటీవ‌ల గుండెపోటుతో మ‌ర‌ణించిన క‌న్న‌డ‌ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కి నివాళులు అర్పించారు. బెంగళూరు వెళ్లిన సూర్య కంఠీరవ స్టూడియోస్ లోని పునీత్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కంటతడి పెట్టారు. అంత్యక్రియలకు రాలేకపోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఆయన కూడా తమ్ముడి మరణం తాలూకు బాధ నుంచి ఇంకా తేరుకోలేదనడానికి నిదర్శనంగా చెమర్చిన కళ్లతో కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement