Wednesday, May 1, 2024

18ఏళ్లునిండిన వారిని ఓట‌రుగా న‌మోదుచేయాలి : కృష్ణయ్య

2022 జ‌న‌వ‌రి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క‌రినీ ఓటరుగా నమోదు చేయాలని వికారాబాద్ మండల తహ‌సీల్దార్ కృష్ణయ్య సూచించారు. శుక్రవారం మండల త‌హ‌సీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశానుసారం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరిని తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ త‌హ‌సీల్దార్ విజయేందర్, బీఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement