Friday, May 17, 2024

ఓ మై గాడ్…వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలు మహిళా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు తీరత్ సింగ్ రావత్ కామెంట్స్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో మోకాళ్లకు పైగా ఖాకీ నిక్కర్లను ధరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిత్ గడ్కరీల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఓ మై గాడ్… వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి’ అని కామెంట్ చేశారు. కొంత కాలం క్రితం వరకు ఆరెస్సెస్ కార్యకర్తలు తమ యూనిఫామ్ లో భాగంగా తెల్లటి చొక్కా, ఖాకీ నిక్కరు ధరించేవారు. ఇటీవలే నిక్కరు స్థానంలో ప్యాంటు వేసుకునేలా మార్పులు తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement