Saturday, May 4, 2024

ప్ర‌ధాని మోడీది పొలిటిక‌ల్ డ్రామా – మంత్రి త‌ల‌సాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పొలిటిక‌ల్ డ్రామా ఆడుతున్నార‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మండిప‌డ్డారు. పార్ల‌మెంట్ లో ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి వ‌చ్చిన మోడీ అస‌లు స‌బ్జెక్ట్ లేకుండా మాట్లాడారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు విభజన చట్టం గురించి ఎందుకు వచ్చిందని.. ఇది పొలిటికల్ డ్రామా అని తలసాని విమర్శించారు. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని… మేమేం ఏదైనా చేయవచ్చని అనుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలు బలంగా లేని సమయంలోనే రాజకీయంగా మార్పులు వస్తాయని తలసాని అన్నారు. ఇది చరిత్ర చెబుతోందని.. రాబోయే కాలంలో అదే జరుగుతుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement