Sunday, May 5, 2024

Breaking : ప్రెస్ మీట్ లో విల‌పించిన చంద్ర‌బాబు..ఓదార్చిన టిడిపి నేత‌లు..

ప్రెస్ మీట్ లో ఉద్వేగంతో విల‌పించారు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు. బోరున విల‌పిస్తూ రెండు నిమిషాలు మాట్లాడ‌లేక‌పోయారు. దాంతో చంద్ర‌బాబును టిడిపి నేత‌లు ఓదార్చారు. గ‌ద్గ‌ద స్వ‌రంతో మీడియాతో మాట్లాడారు చంద్ర‌బాబు. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అవ‌మానిస్తోంద‌ని వైసీపీపై ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు కుటుంబంలోని మ‌హిళ‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు నోరు పారేసుకున్నార‌ని విల‌పించారు.

త‌న భార్య భువ‌నేశ్వ‌రి ఇల్లు దాటి ఎప్పుడు బ‌య‌టికి రాలేద‌న్నారు. భువ‌నేశ్వ‌రి చేసిన త్యాగం చాలా గొప్ప‌ద‌ని అన్నారు. వైసీపీ వారికి టిడిపి ఎమ్మెల్యేలు, నేత‌ల‌ను అవ‌మానించ‌డం ప‌రిపాటిగా మారిందన్నారు. దాంతో తీవ్రంగా క‌ల‌త చెంది మీడియా ముందు క‌న్నీరు పెట్టుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై టిడిపి మండిప‌డింది. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా అవ‌మానించ‌లేద‌ని తెలిపారు. ఇన్నేళ్ళూ ఎన్నో అవ‌మానాలు భ‌రించాన‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement