Saturday, May 11, 2024

‘రాష్ట్ర‌ప‌తి’కి చీర‌కొంగుతో దిష్టి తీసిన ‘ట్రాన్స్ జెండ‌ర్’..వైర‌ల్ గా వీడియో..

ప‌ద్మ అవార్డుల వేడుక స‌మ‌యంలో.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఓ విన్నూత ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు జాన‌ప‌ద నృత్య‌కారిణి, ట్రాన్స్‌జెండ‌ర్ మంజ‌మ్మ జోగ‌తి.. . అయితే ఆ అవార్డు స్వీక‌రించేందుకు వెళ్లిన మంజ‌మ్మ .. త‌న‌దైన రీతిలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను దీవించింది. క‌ర్నాట‌క‌కు చెందిన ట్రాన్స్‌జెండ‌ర్ మంజ‌మ్మ‌కు ఫోక్ డ్యాన్స్ క్యాట‌గిరీలో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. అయితే ఆ అవార్డును అందుకునేందుకు రాష్ట్ర‌ప‌తి కోవింద్ వ‌ద్ద‌కు వెళ్లిన ఆమె ఆయ‌న్ని దీవించింది. త‌న చీర కొంగుతో కోవింద్‌కు దిష్టి తీసి.. శుభం క‌లిగేలా దీవ‌నెలు చేసింది. మంజ‌మ్మ త‌న చీర‌తో కోవింద్‌కు గుడ్‌ల‌క్ చెప్పిన తీరు అక్క‌డ ఉన్న‌వారిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement