Saturday, May 4, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌లిసిన క్రిష్, మ‌ద‌న్ కార్కీ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్ లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీలో న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. దర్శకుడు క్రిష్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, రచయిత కణ్ణన్ లతో కలిసి మదన్ కార్కీ నేడు పవన్ కల్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఈ భేటీపై కార్కీ స్పందిస్తూ…పవన్ కల్యాణ్ సర్ తో సాహిత్యం, రాజకీయాలు, మానవ వికాసం, భాషలు వంటి అంశాలపై ఎంతో లోతైన చర్చ జరిగింది. ఆయన కొత్త చిత్రం కోసం పాటలు, డైలాగులపై ఆసక్తికర రీతిలో చర్చించామ‌ని వెల్ల‌డించారు. పవన్ క‌ల్యాణ్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా మదన్ కార్కీ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement