Saturday, May 18, 2024

Uttarakhand : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్ లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ లోని.. పానీ వాలా బ్యాండ్ సమీపంలో టూరుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీకి చెందిన నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు టూర్ కు వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో పానీ వాలా బ్యాండ్ సమీపంలో లోతైన గుంటలో కారు పడిపోయింది.

దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మృతిచెందగా.. నాన్సీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉందని.. ఎస్పీ సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement