Friday, April 26, 2024

మోడీతో య‌శ్.. రిష‌బ్ శెట్టి.. వైర‌ల్ గా ఫొటోస్

క‌న్న‌డ స్టార్ హీరోలు యశ్, రిషబ్ శెట్టి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. కర్ణాటక లో… మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం.. పలుగురు బీజేపీ నేతలు, ఎన్నికల విషయాలపై చర్చలు నిర్వహించారు. అనంతరం..కన్నడ హీరోలు యశ్, రిషబ్ శెట్టిలతో దేశ ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్‌ను కూడా గుర్తు చేసుకున్నారు మోడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement