Wednesday, May 15, 2024

Revanth: మోదీ ప్రసంగంలో రెండు వాస్తవాలు.. అవి ఏంటంటే..

రాష్ట్ర విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం రెండు వాస్తవాలను బట్టబయలు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్సే తప్ప TRS కాదన్నారు. BJP తెలంగాణను ద్వేషిస్తుందని, తెలంగాణ కోసం ఏమీ చేయలేదని చెప్పారు. తెలంగాణ అమరవీరులను అవమానించినందుకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి… ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ ఆక్షేపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement