Friday, May 3, 2024

సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’

పెద్దపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 29, 12 వ వార్డులను సందర్శించారు. కాలనీల్లో ప్రజలతో నేరుగా మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ తోపాటు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు కరమైన సిసి రోడ్లు, డ్రైనేజీలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రానున్న రోజుల్లో పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement