Sunday, May 5, 2024

నేడు హైదరాబాద్ కు ప్రధాని.. రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. తొలుత శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్ చేరుకుని రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే దాదాపు మూడు గంటలపాటు ఉంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన పర్యటించే మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement