Wednesday, May 15, 2024

Breaking: ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మోదీ ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైకులు ఆపేసి చర్చ లేకుండా ఏపీని విభజించారని అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే వాడారని తెలిపారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని చెప్పారు.  

తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ.. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనం అని తెలిపారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేసిందన్నారు. ఏపీని కాంగ్రెస్‌ విభజించిన తీరు సరికాదు అని మోదీ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement