Friday, May 17, 2024

సీఎం సభకు తరలి రండి: టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు

ఈ నెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుండి సుమారు 5 వేల మంది వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement